కడపలోని గోపవరం మండలంలో దారుణ ఘటన జరిగింది. దస్తగిరి కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వస్తున్న దారిలో మాటు వేసిన ఐదుగురు కామాంధులు కిడ్నాప్ చేసి సమీప అడవిలోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిజం ఎక్కడ బయటపెడుతుందోనని బాధితురాలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు.