ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. జ్యోతిష్కుడుని భార్యాభర్తలు కలిసి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. భీమిలి మండలంలోని నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక అనే దంపతులు... ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో వీరు నివాసం ఉంటున్నారు.
ఈ నెల 9వ అప్పన్నను కలిసిన చిన్నారావు తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని, పూజలు చేయాలంటూ బైకుపై ఎక్కించుకుని బయలుదేరాడు. బోయపాలెం - కాపులప్పాడ మార్గంలో కల్లివానిపాలేనికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి, చాకుతో అప్పన్నపై దాడిచేసి చంపేశాడు.
ఈ క్రమంలో చేతికి గాయంతో కావడంతో తర్వాత రోజున కేజీహెచ్లో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జ్యోతిష్కుడు మృతదేహం పడివున్న ప్రాంతానికి వెళ్లి పెట్రోల్ పోసి తలగబెట్టాడు. ఈ నెల 19వ తేదీన కల్లివానిపాలెం వద్ద ఆస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.