విజయనగరం జిల్లాలోని శ్రీహరిపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కూతురే భర్తతో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది. వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లాకు చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి కాంట్రాక్టులు చేస్తూ ఆస్తిని బాగా సంపాదించాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.