మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు అస్సలు కలిసిరాలేదు. ప్రశాంతంగా సినిమాలకే తన జీవితాన్ని అంకితం ఇచ్చుకోకుండా ఏదో మార్పు చేస్తానంటూ.. చిరంజీవి రాజకీయాల్లోకొచ్చి నానా అవస్తలు పడుతున్నారు. పీఆర్పీని మూసేయడం.. కాంగ్రెస్లో చేరడం.. పీఆర్పీని విలీనం చేయడం వంటివి జరగడం చిరంజీవి రాజకీయ భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయి.
మూడు నిముషాలు మాట్లాడవలసిన చిరంజీవి తన ఊక దంపుడు ఉపన్యాసాన్ని వరస పెట్టి చదువుకుంటూ పోతూ ఎనిమిది నిముషాలు దాటిపోయినా, అధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ ఎన్ని సార్లు బెల్ కొట్టినా పట్టించుకోక పోవడంతో కోపంతో కురియన్ ఎవరో రాసిచ్చిన ప్రసంగం చదవడం సభా మర్యాద కాదు అంటూ సభ సమక్షంలో బహిరంగంగా చిరంజీవిపై సెటైర్లు వేయడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా మెగాస్టార్గా తెలుగు సినిమాను శాసించిన చిరంజీవికి ఇదేమి పరిస్థితి అని చిరంజీవి అభిమానులు అనుకునేట్లుగా చేసింది.