శబ్దాలు లేని దీపావళిని జరుపుకోండి: సెలబ్రిటీలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా దీపావళి పండుగను జరుపుకోవడానికి సన్నద్దమౌతున్నారు. దీనికిగాను తక్కువ శబ్దాలు వచ్చే టపాకాయలు పేల్చుకోవాలని, వీలైతే శబ్దాలు లేని దీపావళిని జరుపుకునేందుకు ప్రయత్నించాలని సినీ, టీవీ కళాకారులు సూచించారు. దీంతోపాటు చాలా జాగ్రత్తగా దీపావళి పండుగను జరుపుకోవాలంటున్నారు సెలబ్రిటీలు.

తక్కువ శబ్దం కలిగే టపాకాయలు వాడాలని, దీంతో శబ్ద కాలుష్యం తక్కువగా ఉంటుందని, అది కూడా పర్యావరణాన్ని రక్షించే రీతిలో దీపావళి పండుగను జరుపుకోవాలని బాలీవుడ్ నటి అమృతారావ్ అన్నారు.

ప్రతి పట్టణం, చిన్న చిన్న గ్రామాల్లో జరుపుకునేవారు తమ తోటి వారిని దృష్టిలో ఉంచుకుని పండుగ జరుపుకోవాలని ఆమె సూచించారు. అలాగే పిల్లలు, పెద్దల గురించి ఇలాంటి సందర్భంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

అలాగే శేఖర్ సుమన్ మాట్లాడుతూ... నాకు ఎక్కువ శబ్దం చేసే టపాకాయలు, చిచ్చురుబుడ్లు పెద్దగా ఇష్టం లేదని అన్నారు. దీపావళి పండుగ సంబరాల పండుగ. ఈ పండుగను ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటారు. అలాంటి ఈ పండుగలో విషాదచ్ఛాయలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి