6370 కేంద్రాలతో తంటా... జాగ్రత్తలు తీసుకున్నాం... రమాకాంత్

శనివారం, 5 ఏప్రియల్ 2014 (18:26 IST)
FILE
తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రేపు అంటే.... ఆదివారంనాడు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎంపీటీసీకి, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయనీ, ఐతే ఈ రెండు బ్యాలెట్లకు వేర్వేరు రంగులతో ఇవ్వనున్నామన్నారు. ఇకపోతే పోలింగ్ కేంద్రాలలో 6,370 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా తమ దృష్టికి వచ్చాయనీ, ఇక్కడ తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి