చంద్రబాబు చాలా మంచివారు... కానీ ఆయన విధానాలే... పురంధేశ్వరి

శనివారం, 5 ఏప్రియల్ 2014 (15:39 IST)
FILE
చంద్రబాబు నాయుడుతో తనకు ఎలాంటి వ్యక్తిగతమైన కోపం లేదనీ, అయితే అప్పటి ఆయన విధానాలు, పరిస్థితుల కారణంగానే వేరే కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందని విశాఖపట్టణం ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి చెప్పారు. చంద్రబాబుపై తనకు ఎలాంటి కోపం లేదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు.

తన మరిది అయిన చంద్రబాబును తానెప్పుడూ ఓ శత్రువులా చూడలేదని అన్నారు. తెలుగుదేశం, భాజపాలు మధ్య జరుగుతున్న పొత్త చర్చలు ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కావనీ, రెండు పార్టీల మధ్య జరుగుతున్నదని పురంధేశ్వరి అన్నారు.

వెబ్దునియా పై చదవండి