శంకరమ్మకు టీడీపీ ఎర్రబెల్లి బాసట... కేసీఆర్ నీకు పోటీకి దమ్ముందా?

శనివారం, 5 ఏప్రియల్ 2014 (12:29 IST)
FILE
తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ ప్రాధాన్యం లేనటుంటి పరాజయం పాలయ్యే హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయించి తెరాస చేతులు దులుపుకోవడంపై టీడీపి నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. దమ్ముంటే కేసీఆర్ హుజుర్ నగర్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఐతే టీఆర్ఎస్ నాయకత్వం మాత్రం శంకరమ్మ 2014 ఎన్నికల్లో హుజుర్ నగర్ నుంచి పోటీ చేస్తే చేస్తారు లేదంటే లేదన్నట్లు ఆ టిక్కెట్ ఇచ్చి చేతులు దులుపేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు శంకరమ్మకు ఇలాంటి సీటు కేటాయించడంపై అమరవీరుల కుటుంబాలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలుస్తూ తన ప్రాణాన్ని బలిదానం ఇచ్చిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తెరాస అధినేత కేసీఆర్ ఇవాళ ప్రకటించిన 69 మంది అసెంబ్లీ ఎన్నికల పోటీ అభ్యర్థుల్లో సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కేటాయించిన నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ కేసీఆర్ నిలబడినా గెలవరనే విమర్శ ఉన్న నేపధ్యంలో శంకరమ్మ కేసీఆర్ పై ధ్వజమెత్తినట్లు సమాచారం. తెరాస గెలవలేని సీటు తనకు ఇస్తారా అని శంకరమ్మ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి నల్గొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ టిక్కెట్‌ని కేటాయించినట్లు తెలిపారు. ఐతే ఈ స్థానం తెరాస ఓడిపోయే స్థానమనీ, అక్కడ పోటీకి దిగితే కెసిఆర్ కు సైతం డిపాజిట్లు దక్కవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కనుకనే పనిగట్టుకుని ఆమెకు అలాంటి ఓడిపోయే స్థానాన్ని కట్టబెట్టారంటూ విమర్శలు వస్తున్నాయి. శంకరమ్మ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వల్లనే ఈ సీటు ఇచ్చారనీ, లేదంటే అసలు ఆయనకు శంకరమ్మకు సీటు ఇవ్వాలన్న ఉద్దేశ్యం లేదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి.

ఏదయితేనేం... శంకరమ్మ కోరుకున్నట్లు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కెసిఆర్ ఇలా కల్పించడం ద్వారా ఆమె నుంచి ఎదురవుతున్న సమస్యను అలా వదిలించుకున్నాడన్న విమర్శలు వస్తున్నాయి

వెబ్దునియా పై చదవండి