కావలసిన పదార్థాలు : పెసరపప్పు.. ఒక కప్పు పచ్చిమిర్చి.. ఆరు ఇంగువ.. చిటికెడు కొబ్బరి.. ఒకటిన్నర టీ. వంటసోడా.. పావు టీ. ఉప్పు.. ఒక టీ. నూనె.. ఒకటిన్నర టీ. పెరుగు.. అర కప్పు ఆవాలు.. పావు టీ.
తయారీ విధానం : పెసరపప్పుని మూడుగంటలపాటు నాననివ్వాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు కలిపి రుబ్బాలి. పప్పుని విడిగా నీళ్లు లేకుండా రుబ్బాలి. ఈ రెండు మిశ్రమాల్ని పెరుగు వేసి కలపాలి. ఓ బాణలిలో నూనె వేసి ఆవాలు వేయాలి. తరువాత పిండి మిశ్రమం, సోడా కూడా వేసి బాగా కలిపి కొద్దికొద్దిగా ఇడ్లీ రేకుల్లో వేసి ఉడికించాలి. ఈ పిండి పులియాల్సిన అవసరం లేదు. అలాగే వేసినా రుచిగా ఉంటుంది.