గోధుమ పిండి పరోటాలు ఎలా చేయాలో తెలుసా?

శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:46 IST)
మనం ప్రతిరోజు రకరకాల అల్పాహారాలను చేసుకొని తింటూ ఉంటాం. కానీ పరోటాలు చాలా అరుదుగా మాత్రమే చేస్తూ ఉంటాం. కానీ పిల్లలు కొత్త ఐటమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పరోటాలను పిల్లలకు ఇష్టం అయ్యేలా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు:
క్యాబేజీ తురుము- రెండు కప్పులు,
గోధుమపిండి- రెండు కప్పులు,
గరం మసాలా- అర టీ స్పూన్,
తరిగిన కొత్తిమీర- ఒక కట్ట,
పసుపు- చిటికెడు,
కారం- ఒక టీ స్పూన్,
నూనె- రెండు టీ స్పూన్లు,
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు,
ఉప్పు- తగినంత,
నీళ్లు-తగినన్ని.
 
తయారీ విధానం...
క్యాబేజీ తురుములో కొద్దిగా ఉప్పువేసి ఉడకబెట్టి, ఉడికాక నీరు మెుత్తం పిండేయాలి. తర్వాత నూనె, నెయ్యి మినహా మిగిలిన పదార్ధాలన్నింటిని ఒక గిన్నెలో వేసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. చివర్లో నూనె కూడా వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పరోటాలు చేసుకొని పెనం మీద నెయ్యితో  కాల్చుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచిగా ఉంచే పరోటాలు రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు