వర్షాలు పడుతున్నాయి. ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జలుబు, జ్వరాలు సులభంగా వచ్చేస్తాయి. అందుచేత పసుపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మిరియాలను వర్షాకాలంలో డైట్లో చేర్చుకోవడం ద్వారా అజీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
వర్షాకాలం పిల్లల్లో అజీర్తి సమస్యలను దరిచేరనీయకుండా ఉంచాలంటే.. వంటకాలలో మిరియాల్ని చేర్చడం తప్పనిసరి. మిరియాల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్, బిటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. అలాంటి మిరియాలతో ఎగ్ పెప్పర్ ఫ్రై ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
పసుపు పొడి - పావు టీ స్పూన్
తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్లో బియ్యం పిండిని వేసి అందులో పచ్చిమిర్చి తరుగును చేర్చుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పసుపు పొడి, ఉప్పు, కరివేపాకు చేర్చి కొంచెం నీటితో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించి సగానికి కట్ చేసిన కోడిగుడ్లకు పట్టించి అర్థగంట పాటు పక్కనపెట్టాలి. అరగంట తర్వాత చిన్నపాటి పాన్లో నూనె పోసి మసాలా పట్టించిన ఎగ్ను నూనెలో దోరగా వేసి.. సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని సాస్తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. అంతే ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్లే.