జ్యేష్ఠ 4వ పాదములో జన్మించినట్లైతే..?

గురువారం, 31 జులై 2014 (17:58 IST)
జ్యేష్ఠ 4వ పాదములో జన్మించిన జాతకులు పుట్టిన 4 సంవత్సరముల వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 4-11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో చిటికెన వేలుకు ధరించగలరు. 
 
11 సం.లు వయస్సు నుండి 31 సం.లు వరకు శుక్ర మహర్దశ కావున వజ్రము బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 31 సం.లు వయస్సు నుండి 37 సం.లు వరకు రవి మహర్దశ కావున కెంపును వెండిలో ఉంగరపు వేలుకు ధరించగలరు. 37 నుంచి 47 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ కావున ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం మంచిది. 
 
47-54 సం.లు వరకు కుజ మహర్దశ కావున పగడమును బంగారములో ఉంగరపు వేలుకు ధరించగలరు. 54 సం.లు నుంచి 72 ఏళ్ల వరకు ఈ జాతకులకు రాహు మహర్దశ కావున గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించగలరు.

వెబ్దునియా పై చదవండి