అనాసపండులోని విటమిన్ ఎ, బి, సిలు పొట్టను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖానికి తేజస్సును ఇస్తే అనాసపండులో ధాతువులు, పీచు, ఇనుము శక్తులున్నాయి. ఇవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. అనాస పండు రసంతో తేనె కలిపి 40 రోజుల పాటు తీసుకుంటే.. తలనొప్పి, నోటిపూత, మెదడు సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.
అలాగే బాదం పౌడర్తో కాసింత తేనె కలిపి ఉదయం అల్పాహారానికి ముందు తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. కేరట్తో తేనె కలిపి తీసుకుంటే.. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఇంకా బరువు కూడా తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు, అనారోగ్యం నుంచి బయటపడాలంటే తప్పకుండా అనాస పండును తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.