నూడిల్స్లో చేర్చే క్యాండిల్ మన శరీరానికి కావలసిన విటమిన్స్, ధాతువులను మింగేస్తాయి. తద్వారా మెదడు సంబంధిత రోగాలు తప్పవు. అంతేగాకుండా.. హర్మోన్ల ఉత్పత్తికి బ్రేక్ వేస్తాయి. చర్మాన్ని, కేశాలను సంరక్షించే విటమిన్లను కరిగిస్తాయి.
క్యాండిల్స్ కలిపిన నూడిల్స్ తినడం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులు, హైబీపీ, ఒబిసిటీ, మధుమేహం వంటి వ్యాధులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూడిల్స్లో ఉపయోగించే క్యాండిల్స్ అనే పదార్థం ద్వారా మెదడుకు అందే విటమిన్స్ నిరోధించబడతాయి. తద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది.
నూడిల్స్లోని మైదా రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడం ద్వారా టైప్ 2 మధుమేహానికి దారితీస్తుంది. ఇంకా నూడిల్స్లో చేర్చే బ్లీచింగ్, అలోక్సన్ల ద్వారా ఇన్సులిన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా మధుమేహం తప్పదు.
అయితే సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే నూడిల్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మేలేనని, వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అందుకే తృణధాన్యాలు, బియ్యం, రాగి, సజ్జలతో తయారు చేసే నూడిల్స్ను కొనాలని వారు సూచిస్తున్నారు. వీటిలో విటమిన్స్, క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి, బి-6, నియాసిన్, మాగ్నీషియం వంటివి ఉన్నాయి.