గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపల కూరను ఆహారంలో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చేపల ఆహారం కప్పు మోతాదులో తీసుకుంటూ వుంటే, గుండె సవ్యంగా పనిచేస్తుందని తద్వారా గుండెపోటు వంటి హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని.. అలాగే మధుమేహాన్ని కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆయిలీ ఫిష్ తింటే టైప్-2 డయాబెటిస్తో బాధపడే మధ్యవయసు, వృద్ధుల్లో కంటిచూపు సురక్షితంగా ఉంటుందని పరిశోధనలో తేలింది.