ఒక రోజులో మనిషికి 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోవాలంటారు వైద్య నిపుణులు. నిద్ర అంతకన్నా ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో తేల్చారు. అంతేకాదు, నిద్ర హెచ్చు తగ్గుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిశోధన ప్రకారం, తక్కువ సమయం నిద్రించేవారు శ్వాస ఆడకపోవటం వంటి సమస్యతో, అలాగే ఎక్కువ లేదా తక్కువ సమయం నిద్రించేవారు గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు తెలిపారు.