సాధారణంగా చాలా మంది మైగ్రెయిన్తో బాధపడుతుంటారు. ఇది ఓ పట్టాన తగ్గదు. ప్రపంచ వ్యాప్తంగా మైగ్రెయిన్తో బాధపడేవారి సంఖ్య కోటాను కోట్లుగా ఉంది. ఒక్క అమెరికాలోనే నాలుగు కోట్ల మందికిపైగా ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అనేక సర్వేలు చెపుతున్నాయి. దాంతో అక్కడ అనేకమంది పరిశోధకులు దీని నివారణకు ప్రత్యామ్నాయ వైద్యాలమీద దృష్టిని సారించి విజయం సాధించారు.
ఇందులోభాగంగానే ఇటీవల అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ మైగ్రెయిన్పై ఓ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా తలనొప్పి, మైగ్రెయిన్లను తగ్గించేందుకు యోగా, ధ్యానం రెండింటి కలయికతో ఓ ప్రత్యేక పద్ధతిని రూపొందించారు. ఆపై మైగ్రెయిన్ తీవ్రతను బట్టి బాధితులను విభిన్న వర్గాలుగా విభజించి వాళ్లతో నెలరోజులపాటు ఆ ప్రత్యేక యోగాని చేయించగా ఆ వ్యాధి తీవ్రత చాలావరకూ తగ్గిందట.