వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉన్నాయి. వెల్లుల్లిని మెత్తగా చేసి అందులో ఉప్పు, కారం కొంచెం కలిపి వేడి వేడి అన్నంలో తీసుకుంటే రుచిగా ఉండడమే కాదు గొంతు ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.
అరకప్పు వేడి నీటిలో చెంచా శొంఠి పొడి, అర చెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనె కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తే నొప్పి, మంట అదుపులోకి వస్తాయి.