చెన్నైలో డైజెస్టివ్ డిసీస్ వీక్

ప్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజీ, భారత గ్యాస్ట్రో ఎంటరాలజీ, తమిళనాడు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం 9వతేదీ నాటినుంచి 12వ తేదీ వరకు చెన్నై నగరంలో డైజెస్టివ్ వీక్ సదస్సను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 50మందికి పైగా ప్రముఖ వైద్యులు పాల్గొననున్నారు. శుక్రవారంనాడు వీరికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇదిలావుండగా వీరికి 11వ తేదీన ఎండోస్కోపిక్ ఆల్ట్రాసోనోగ్రామ్(ఈయూఎస్) విధానంపై శిక్షణ ఉంటుంది.

చివరిరోజైన 12వ తేదీన అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన బృందం సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని దేశీయ వైద్యులకు విలువైన సమాచారం వారు అందిస్తారని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి