శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో భాగంగా ఎస్కేఏ2లో చోటుచేసుకున్న జన్యు ఉత్పరివర్తనంపై దృష్టి సారించారు. దీంతో, పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల మెదళ్ళలో లభ్యమైన శాంపిల్స్తో, ఈ ఎస్కేఏ2 జన్యువులో లభ్యమైన శాంపిళ్ళు సరిపోలాయట.
ఇక, రక్త పరీక్ష ద్వారా ఈ జన్యువు తీరును గుర్తించవచ్చని, తద్వారా మనిషిలో ఆత్మహత్య ఆలోచనను నివారించేందుకు వీలుంటుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జకర్యా కామిన్ స్కీ తెలిపారు.