ఇదే అంశంపై ఏఐవోసీడీ అధ్యక్షుడు జేఎస్ షిండే మాట్లాడుతూ.. ఆన్లైన్లో ఔషధ విక్రయాలను కేంద్రం తక్షణం నిషేధించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 ప్రకారం.. ఇంటర్నెట్ ద్వారా మందులు విక్రయించడం చట్టవ్యతిరేకమన్నారు.
ఈ-ఫార్మసీ వ్యాపారంపై తామిచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని షిండే అన్నారు. దీంతో దేశంలోని 8 లక్షల మంది కెమిస్ట్లు, 80 లక్షల మంది కార్మికులు వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలపై ప్రభావం పడుతున్నదని ఆయన అన్నారు.