ఈ మధ్య కాలంలో ఏ ఆహారం తిన్నా విపరీతంగా ఒళ్లు చేస్తుంది. నిజానికి బయట దొరికే జంక్ ఫుడ్స్కి అలవాటు పడ్డవారికి వెంటనే ఒళ్లు పెరగడం, పొట్టరావడం జరుగుతోంది. వీటిని తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..? శరీరం నాజుగ్గా ఉంచుకోవడం కోసమని కొందరు, ఆరోగ్యం కోసమని ఇంకొందరు చెబుతుంటారు.
ఉదయం 11 గంటలకు ఒక గ్లాస్ బత్తాయి రసం తీసుకోవాలి.
మధ్యాహ్నం 1 గంటకి బొప్పాయి జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.
రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి.
ఇలా వారానికి ఒకసారి చేస్తే పొట్టలో మొత్తం శుభ్రమై మెటబోలిక్ రేట్ పెరిగి జీర్ణశక్తి పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్ కరుగుతుంది. సో మీరు ట్రై చేయండి.