సంతానలేమికి రాత్రిపూట ఫోన్లు వాడటానికి లింకుందా?

బుధవారం, 13 డిశెంబరు 2017 (10:30 IST)
పెళ్లై ఐదేళ్లు దాటినా ఇంకా పిల్లలు పుట్టలేదని ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. అమ్మ కావాలనే కోరిక ప్రతి స్త్రీకి తప్పనిసరిగా వుంటుంది.

 కానీ సంతానలేమి సమస్యకు ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది ప్రస్తుతం అందరి జీవితాల్లో ఒక భాగమైందని.. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించేంతవరకు వీటిని ఉపయోగించడం ద్వారా.. వాటి నుంచి వచ్చే రేడియేషన్ సంతాన లేమికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఫోన్‌ను అతిగా వాడటం ద్వారా.. పక్కనబెట్టుకుని నిద్రించడం ద్వారా సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం మొబైల్ ఫోన్లను వాడటం వ్యసనంగా మారింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల సంతానలేమి ఏర్పడటంతో పాటు నీర‌సం, గుండె పోటు, గుండె సంబంధ వ్యాధులు, ఊబ‌కాయం, మ‌ధుమేహం వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఫోన్లను అధికంగా వాడే వారిలో హార్మోన్లు అస‌మ‌తుల్యంగా మారుతాయ‌ట‌. నిద్రలేమి తప్పదట‌. శ‌రీరానికి ముఖ్యంగా కావ‌ల్సిన మెల‌టోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి త‌గ్గుతుంద‌ట‌. దీంతో సంతానలేమి తప్పట్లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు