చక్కెర వ్యాధిగ్రస్తులు నెయ్యి తినొచ్చా...?

గురువారం, 7 జూన్ 2018 (14:37 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో చక్కెర వ్యాధి ఒకటి. డయాబెటిక్ కేంద్రంగా భారత్ మారుతోంది. ఈ వ్యాధి బారినపడి మరణించేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే, ఈ వ్యాధి బారినపడిన వారు నెయ్యి తినొచ్చా? అనే సందేహం ఉంది. దీనిపై వైద్య నిపుణులను సంప్రదిస్తే, చక్కెర వ్యాధిగ్రస్తులు నిర్భయంగా నెయ్యి తినవచ్చునని చెపుతున్నారు. నెయ్యిని మధుమేహం ఉన్నవారు రోజు వాడితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో జీర్ణ సమస్యలుంటాయి. మలబద్దకం ఉంటుంది. అదే వారు నెయ్యి తింటే జీర్ణ సమస్యలు పోతాయి. విరేచనం సాఫీగా అవుతుంది. 
* డయాబెటిస్ ఉన్న వారు నెయ్యిని తినవడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహిస్తుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. 
* నెయ్యిలో సమృద్ధిగా ఉండే లినోలీయిక్ యాసిడ్ మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 
 
* రోజూ నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. 
* బాగా లావుగా ఉండే టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు నెయ్యి ఇది మేలు చేస్తుంది. 
* నెయ్యిలో ఉండే విటమిన్ కె డయాబెటిస్ ఉన్న వారిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు