ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం పిల్లలు, 45 శాతం మధ్య వయస్కులు, 25 శాతం వృద్ధులు గోళ్ళు కొరికే అలవాటుకు బానిసైపోయారని తాజా అధ్యయనంలో తేలింది. గోళ్ళు కొరకడం కూడా ఫ్యాషనైపోయిందని.. దాన్ని కూడా స్టైల్గా కొరుకుతున్నారని స్టడీలో తెలియవచ్చింది. సంతోషంగా, ఒంటిరిగా ఉండటాన్ని ఇష్టపడని వారు గోళ్ళు కొరకడం మొదజలెట్టేస్తున్నారు.
గోళ్ళు కొరకడం ద్వారా..
* గోళ్ళలో ఉండే సల్మోనెల్లా, ఇ.కొలి బ్యాక్టీరియా, మురికి నోటి ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి. తద్వారా వ్యాధులు తప్పవు.
* వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. పరోనిచియా అనే చర్మ వ్యాధికి దారితీస్తుంది. దీనికి సర్జరీ తప్పదు. గోళ్ళు కొరికే వారికి వేళ్ళలోని క్రిముల ద్వారా హ్యూమన్ పాపిలోమా వైరస్తో దెబ్బేనని, తద్వారా క్యాన్సర్ ఏర్పడే ప్రమాదముంది.