మరిచిపోవాలనుకునే వాళ్ళని గుర్తు చేస్తుంది ఈ సమాజం..

FILE
ఏ పత్రికలు చూసినా దొంగతనాలు, హత్యలు వంటి వార్తలే కనిపిస్తున్నాయ్ ఎందుకని?.. దేశమంతటా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నా మంచిని మంచిగా చెప్పుకునే కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు.

సమాజానికి ఎంతో ఉపయోగకర సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఒక జేబుదొంగ బస్సులో దొంగతనం చేస్తే అతను వెంటనే ఫేమస్ అయిపోతున్నాడు.

చరిత్రలో హిట్లర్ గురించి, యుద్ధాల గురించి చెప్పుకునేలా బుద్ధుడు గురించి మహాత్ముల గురించి చెప్పుకోవడం లేదు. మరిచిపోవాలనుకునే వాళ్ళని గుర్తుచేస్తుంది ఈ సమాజం. కాని గుర్తుంచుకోవలసిన వాళ్ళను మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ఇటువంటి తప్పుడు పద్ధతులను విడనాడినప్పుడే మన సమాజం కూడా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి