ఆ వెబ్సైట్లో భక్తులు తమ పేరు, చిరునామా, ఫోటోను జత చేసి వర్చువల్ క్వ్యూ కార్డును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని సూచించిన టైం కంటే అర గంట ముందుగా పంబకు వెళ్లినట్లైతే అక్కడ ఉన్న ప్రత్యేక కేంద్రంలో అధికారులు పరిశీలించి కొండపైకి ఎక్కేందుకు అనుమతిస్తారు.
ఈ విధానం ద్వారా ఒక గంట సేపటిలో ఆలయానికి చేరుకుని 18 మెట్లు ఎక్కి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చును. ఈ సేవ నవంబర్ 16వ తేది నుంచి డిసెంబర్ 27వ తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం 2015 జనవరి నెలల జరిగే మకర దీప పూజ వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.