ఇద్దరూ ఇద్దరే.. వెంకన్న భక్తులే... : జేఈవో శ్రీనివాస రాజు

మంగళవారం, 20 జనవరి 2015 (20:45 IST)
వేంకటేశ్వర స్వామి నామ సంకీర్తన చేయడంలో ఇటు అన్నమాచార్య అటు పురంధర దాసలు ఇద్దరూ ఇద్దరేనని తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస రాజు తెలిపారు. మంగళవారం తిరుమలలోని ఆస్థాన మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకున్న అక్షర యజ్నం ద్వారా వేంకటేశ్వర స్వామికి సంకీర్తనలు రాయడంలో కృషి చేసిన వారేనని అన్నారు. 
 
అన్నమయ్య తెలుగు పదకవితా పితామహుడుగా గుర్తింపు పొందారన్నారు. ఆయన 32 వేల సంకీర్తనలు రాశారని చెప్పారు. పురధర దాస్ కూడా తక్కవైన వాడు కాదని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో ఉడిపి స్వామి విద్యాధీశ తీర్థ, యేషప్రియ తీర్థ, రాఘవేంధ్ర స్వామి మఠం స్వామి సుబుదేంద్ర తీర్థ తదితరలు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి