తిరుమలలో వ్యాపారాలు చేసుకుంటూ, దుకాణాలలో పరిశుభ్రత పాటించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీ ఆరోగ్య శాఖ వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, అన్నదానం కాంప్లెక్సు, షాపింగు కాంప్లెక్సులు, కొబ్బరికాయల విక్రయ కేంద్రం, మఠాలు తదితర ప్రాంతాలలో నిశితంగా పరిశీలించి పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలని కోరారు.