సోమవారం ఉదయం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఉన్నట్లుండి గాలిగోపురాన్ని చేరుకున్నారు. అక్కడ నుంచి కాలి నడక అలిపిరి వరకూ వచ్చారు. దారిలో భక్తులతో మాట్లాడారు. గాయపడి భక్తులకు సౌకర్యాలు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. దర్శన టోకెన్లు మొదలుకుని లగేజీ, మజ్జిగ, నీళ్ళ వసతిపై ఆరా తీశారు.