తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి... కుటుంబ సభ్యులతో సహా..

శనివారం, 11 జులై 2015 (13:27 IST)
సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు విచ్చేసిన ఆయన కళ్యాణోత్సవ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడు రాంచరణ్ కొత్తగా ఎయిర్ లైన్స్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
 
సినీ నిర్మాత ఎన్వీ ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్‌లు ఆయన వెంట ఉండి దర్శనం చేయించారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఆలయంలోకి ప్రవేశించిన చిరంజీవి వెంట పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె శ్రీజలు ఉన్నారు. తాను వెంరటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్లు చెప్పారు. ప్రత్యేకత ఏమి లేదని చిరంజీవి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి