తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలోని కోదండ రాముడి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను టీటీడీ ఈవో డి సాంబశివరావు గురువారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి 26 వరకూ జరిగే బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం చేశారు. ఈ బ్రహ్మోత్సవ అంకురార్పణ ఈ నెల 17న జరుగనున్నది.