చవితి నాడు స్వామి దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇది సరిహద్దు ప్రాంతం కావడంతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాలలో కాణిపాకం చేరుకుంటున్నారు. ఆలయంలో సాధారణ దర్శనం, ప్రత్యేక దర్శనాలలో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు.