అంతకు మునుపు లక్ష లడ్డూలు ఇచ్చేవారు. దానిని క్రమంగా 50 వేలకు, తర్వాత 25వేలకు తగ్గించేశారు. ఆదివారం ఆ 25లలో కూడా కోత విధించారు. కేవలం 15 వేలు మాత్రమే కేటాయించారు. దీంతో అదనపు లడ్డూలు కావాలనుకున్న వారికి తిప్పలు తప్పలేదు. లడ్డూలు దొరకకుండానే వెనుదిరిగారు. బ్రహ్మోత్సవాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు నిల్వ ఉంచడంతో భాగంగా అదనపను లడ్డూలకు కోత విధించినట్లు తెలుస్తోంది.