తిరుమాడ వీధులలో అశ్వవాహనంపై ఊరేగిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు(వీడియో)

గురువారం, 24 సెప్టెంబరు 2015 (07:09 IST)
తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారు కల్కి రూపంలో అశ్వవాహనంపై విహరించారు. తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామి దర్శించుకుని భక్తులు తరించారు. 
 
కలిపురుషుని ప్రభావంతో స్వామి భక్తులు కష్టాలకు లోనవుతారు. తన భక్తులను పరిరక్షించేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో అశ్వాన్ని అధిరోహించి కలి సంహారం చేసి భక్తులను కాపాడుతాడని అనంత భక్తకోటి విశ్వాసం. అందులో భాగంగానే స్వామి బ్రహ్మోత్సవాలలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని భక్తులు నమ్ముతారు. రాత్రి 9 గంటల నుంచి 11 వరకూ సాగిన అశ్వవాహనంలో స్వామి మెరిసిపోయారు. 

వెబ్దునియా పై చదవండి