తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

గురువారం, 26 ఫిబ్రవరి 2015 (08:30 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 52,902 మంది స్వామిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 7 నిండాయి. నడక దారిన వచ్చే భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికోసం మూడు గంటల సమయంలో పడుతోంది. 
 
 

 ఆర్జిత బ్రహ్మోత్సవం 177 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ 120ఖాళీగా ఉన్నారుు. వసంతోత్సవం 79 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ

వెబ్దునియా పై చదవండి