తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి కనీసం 50 వేల మందికిపైగా దర్శనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రానికి సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, వారికి 12 గంటల సమయం పడుతోంది. ఇక కాలి బాటన వచ్చేవారు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి రెండుగంటల సమయం పడుతోంది.