తిరుమలలో గరువారం భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. తిరుమలలో బుధవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 52,121 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 5 నిండాయి. వారికి 6గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.