తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 58,777 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 17 నిండాయి. వారికి 12గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 5 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది.