తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

మంగళవారం, 31 మార్చి 2015 (08:07 IST)
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ  సాధారణంగా ఉంది.  తిరుమలలో సోమవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 63,343 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 5 నిండాయి. వారికి 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 2 గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా బుధవారం కూడా రద్దీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి