తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (08:19 IST)
తిరుమలలో శుక్రవారం భక్తులతో తిరుమల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో గురువారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 42,952  భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్టుమెంట్లు  పూర్తిగా నిండిపోయాయి. భక్తులు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. .
 
ఇక నడకదారిన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో నిండి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి వీరికి 3 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ  పెరిగే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి