తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

గురువారం, 26 మార్చి 2015 (08:50 IST)
తిరుమలలో గురవారం భక్తుల రద్దీ పెరిగింది.  తిరుమలలో బుధళవారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ 39,098 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 14 నిండాయి. వారికి 10 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు 3 కంపార్టుమెంటులో ఉన్నారు. వారికి కనీసం 4గంటల సమయం పడుతోంది. 
 
ఇదిలా ఉండగా గురువారం కూడా మామూలుగానే ఉంటుంది. ఈ పరిస్థితి శుక్రవారం రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి