తిరుమలలో ప్రారంభమైన గోదావరి పుష్కరాల శోభయాత్ర

గురువారం, 9 జులై 2015 (10:04 IST)
తిరుమల నుంచి గోదావరి పుష్కరాలకు శోభయాత్ర గురువారం ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
 
అనంతరం శోభయాత్రను టీటీడీ ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ యాత్ర శ్రీనివాసమంగాపురం, శ్రీకాళహస్తి, అమరావతి, విజయవాడ మీదగా కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా టీటీడీ... ఈ సారెను గోదావరి తల్లికి సమర్పిస్తారు.

వెబ్దునియా పై చదవండి