తిరుమల శ్రీవారి దర్శనమే మహాభాగ్యమనుకునే భక్తులు ఎంతో మంది ఉన్నారు. తనివితీరా స్వామి చూసుకుంటే ఈ జన్మధన్యమవుతుందని భావించే వారు ఉన్నారు. విఐపీలకు మాత్రమే ఎక్కువగా లభించే ఆర్జిత సేవా భాగ్యం మరి సామాన్యులకు కూడా దక్కితే.. అంతకంటే ఆనందం ఏముంది? సరిగ్గా టీటీడీ కూడా అదే చేసింది. ఈ దర్శన్ కేంద్రాల ద్వారా ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.