టీం వర్క్‌తోనే బ్రహ్మోత్సవాలు సక్సెస్... ఈవో

గురువారం, 24 సెప్టెంబరు 2015 (21:03 IST)
సాలకట్ల బ్రహ్మోత్సవాలు కేవలం అందరి కృషితోనే విజయవంతంగా పూర్తి చేయగలిగామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. సాంబశివరావు తెలిపారు. గురువారం తిరుమలలో విలేకరులతో మాట్లాడారు.  పోలీసులు, ఆర్టీసీ, జిల్లా అధికార యంత్రాంగం సహకరించడం వలననే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను పూర్తి చేయగలిగామని అన్నారు. 
 
పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించవలననే ఇది సాధ్యమైందని తెలిపారు. తిరుమలలోని శుభ్రతను సింగపూర్‌లోని శుభ్రతతో చంద్రబాబు నాయుడు పోల్చడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 
 

వెబ్దునియా పై చదవండి