సాలకట్ల బ్రహ్మోత్సవాలు కేవలం అందరి కృషితోనే విజయవంతంగా పూర్తి చేయగలిగామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. సాంబశివరావు తెలిపారు. గురువారం తిరుమలలో విలేకరులతో మాట్లాడారు. పోలీసులు, ఆర్టీసీ, జిల్లా అధికార యంత్రాంగం సహకరించడం వలననే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలను పూర్తి చేయగలిగామని అన్నారు.