తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఆదివారం, 21 డిశెంబరు 2014 (08:20 IST)
తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం నాటికి పెరిగింది. యేడాది ముగుస్తుండడం, క్రిస్మస్ సెలవులు వస్తే మరింత రద్దీ అవుతుంది. శని, ఆదివారాల్లో దర్శనం చేసుకుని వెళ్ళేందుకు వచ్చిన భక్తుల సంఖ్య పెరిగిపోయింది. ఉచిత, రూ 50, రూ 100, రూ 500 గదులు సులభం గా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 20 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 30
రూ. 50 గదులు 13
రూ. 100 గదులు 45
రూ. 500 6

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 145
సహస్రదీపాలంకరణ సేవ  36
వసంతోత్సవం ఖాళీ లేవు.

వెబ్దునియా పై చదవండి