తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

సోమవారం, 22 డిశెంబరు 2014 (08:26 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాటికి సాధారణంగా ఉంది. యేడాది ముగుస్తుండడం, క్రిస్మస్ సెలవులు వస్తే మరింత రద్దీ అవుతుందనుకున్న వారు శని, ఆదివారాల్లో దర్శనం చేసుకుని వెళ్ళారు. దీంతో సోమవారం కాస్త, రద్దీ తగ్గిందనే చెప్పాలి.  50, రూ 100, రూ 500 గదులు సులభం గా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు నిండాయి.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 36
రూ. 50 గదులు 109
రూ. 100 గదులు 26
రూ. 500 4

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 112
సహస్రదీపాలంకరణ సేవ  198
వసంతోత్సవం ఖాళీ లేవు.

వెబ్దునియా పై చదవండి