టీటీడీకి పారిశ్రామిక వేత్త రూ.2 కోట్లు విరాళం

శుక్రవారం, 11 సెప్టెంబరు 2015 (20:41 IST)
బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త కొండా శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆయన విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి చేతికి అందజేశారు. డిడి రూపంలో ఇచ్చారు.  
 
ఇందులో కోటి రూపాయలను అన్నప్రసాద ట్రస్టుకు, మరో కోటి రూపాయలు వెయ్యికాళ్ళ మండపానికి ఇవ్వాలని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి