మార్చి 21 ఉగాది, 28న శ్రీరామ నవమి ఆస్థానం

బుధవారం, 11 మార్చి 2015 (21:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఉగాది, శ్రీరామనవమి పండగలను పురస్కరించుకుని మార్చి 21, మార్చి 28న తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉగాది ఆస్థానం తిరుమల ఆలయంలో నిర్వహిస్తారు. 
 
మన్మథ ఉగాదిని పురస్కరించుకుని చేసే ఈ కార్యక్రమాన్ని తిరుమల ఆలయంలోని బంగారు వాకిలి వద్ద నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని స్వామి సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుడి సమక్షంలో జరుగుతుంది. ఆస్థానం 21న ఉదయం 7 నుంచి 9 గంటల వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం ముందే 17న వచ్చే మంగళవారం రోజున తిరుమంజనం నిర్వహిస్తారు. 28 నిర్వహించే శ్రీరామ నవమి ఆస్థానం అదే స్థానంలో రాత్రి 10 గంటలకు నిర్వహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి