తిరుమలలో రెండు రోజుల పాటు విఐపిల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆది, సోమవారాల్లో ఉదయం బ్రేకు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రకటించారు. సోమవారం రథసప్తమి జరుగనున్నది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.