తిరుమలలో విఐపి దర్శనాలు రద్దు.. ఎందుకు? ఎన్నాళ్లు?

ఆదివారం, 25 జనవరి 2015 (05:00 IST)
తిరుమలలో రెండు రోజుల పాటు విఐపిల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఆది, సోమవారాల్లో ఉదయం బ్రేకు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు శుక్రవారం ప్రకటించారు. సోమవారం రథసప్తమి జరుగనున్నది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
ఆదివారం ఉదయం ప్రొటోకాల్‌ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయి. సోమవారం ప్రొటోకాల్ దర్శనాలు కూడా తక్కువగానే ఉంటాయని అన్నారు. రథసప్తమి రోజున అన్ని వాహనాలు ఒకే రోజు తిరుగుతాయి కాబట్టి రద్దీ కూడా అధికంగానే ఉంటుంది. మినీ బ్రహ్మోత్సవాలుగా పిలువబడే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 

వెబ్దునియా పై చదవండి